Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మహిమలు కలిగిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి కందుకూరు, అమరావతి జ్యోతి:శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గొప్ప మహిమలను కలిగిన స్వామి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అన్నారు. మండలంలోని మాలకొండలో కొలువు తీరీ ఉన్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయమును తమ కుటుంబ సభ్యులు నాగసత్య లత, కుమార్తెలు అనిషా లక్ష్మి, తనూజ లక్ష్మిలతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ పరిసరాలు, పరిశుభ్రత పాటు పచ్చదనం కలిగి ఉందని పేర్కొన్నారు. స్వామి వారిని తరుచూ దర్శించుకుo కుంటున్నామని చెప్పారు. భక్తుల మనసును ఆహ్లాదకరమైన వాతావరణము ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆయన అభిప్రా య పడ్డారు . అయన వెంట టిడిపి నాయకులు సోమినేని రవీంద్ర ఉన్నారు.
Admin
Amaravathi Jyothi