Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,: ఈనెల 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి... కౌంటింగ్ ఏజెంట్లకు, కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం శిక్షణ నిర్వహించారు. మహాకూటమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి *ఇంటూరి నాగేశ్వరరావు* , ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ప్రతి ఏజెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బూత్ ల వారీగా EVM మిషన్ నెంబర్లను, అలాగే పోలైన ఓట్లను తప్పకుండా సరిచూసుకోవాలన్నారు. టెక్నికల్ గా ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే చీఫ్ ఏజెంట్ లేదా లీగల్ టీం కు తెలియజేయాలన్నారు. వైసిపి ఏజెంట్లు కావాలనే రెచ్చగొట్టేలా వ్యవహరించే అవకాశం ఉందని, అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించడంతోపాటు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు అక్కడే ఉండాలని, ప్రతి ఒక్కరూ కౌంటింగ్ నియమాలు తెలుసుకొని వ్యవహరించాలని నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా లీగల్ కమిటీ సభ్యులు చిడిపోతు హరికృష్ణ, బెజవాడ కృష్ణయ్య, వలేటి శ్రీధర్ నాయుడు ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ సీనియర్ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉన్నం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi