Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పంచాయతీ రాజ్ విభాగ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా కుమ్మర బ్రహ్మయ్య ఎన్నిక... కందుకూరు ,అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా పంచాయతీ రాజ్ విభాగ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా కుండి కందుకూరు సర్పంచ్ కుమ్మర బ్రహ్మయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుమ్మర బ్రహ్మయ్య స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మయ్య మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. తనకు ఈ పదవిని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వైసిపి నాయకులు బ్రహ్మయ్యకు దృశ్యాలువ కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు గంగవరపు వెంకటరావు, మాజీ ఏఎంసి చైర్మన్ తోకల కొండయ్య కోవూరు సర్పంచ్ ఆవుల మాధవరావు, అప్పన బోయిన రామయ్య, మర్లపాడు మాజీ సర్పంచ్ బుర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi