Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో లింగసముద్రం మండలంలోని మొగిలిచర్ల, యర్రారెడ్డిపాలెం గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. మేము సైతం - మన రాష్ట్రం కోసం అంటూ... రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గ్రామస్తులకు వివరించారు. చంద్రబాబు నాయుడు యువతకు ఉద్యోగాలు కల్పిస్తే, జగన్ వచ్చాక వారిని మత్తు పదార్థాలకు బానిసలు చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చంద్రబాబు ఇప్పిస్తే... పెద్ద చదువులు చదివినవారికి ఐదువేల రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. పరిశ్రమలు వెళ్లగొట్టిన దుర్మార్గుడు జగన్ అయితే, దేశ విదేశాల్లో తిరిగి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి కియా లాంటి కంపెనీలను ఏర్పాటు చేసిన విజనరీ లీడర్ మన చంద్రబాబునాయుడు అని.... తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక వివరించారు. ఈసారి ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ పై ఓట్లు వేసి గెలిపించాలని... తద్వారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందామని సూచించారు.
Admin
Amaravathi Jyothi