Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా వైసిపి కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా కందుకూరు, అమరావతి జ్యోతి: నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీలేకుండా కృషి చేస్తానని కనిగిరి ఎమ్మెల్యే,కందుకూరు వైకాపా సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆలా వారి కళ్యాణ మండపంలో విలేకరుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కందుకూరు వైకాపా టిక్కెట్ బీసీ ఐన తనకు కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా బుర్రా ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయ మేధావి, సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆశీస్సులతో, తన మిత్రుడు తూమాటి మాధవరావు సహకారంతో, తాను కందుకూరు వైకాపా ఎమ్మెల్యే బరిలో ఉన్నట్టు తెలిపారు. కందుకూరు ప్రజలు తనను ఆశీర్వదించాలని, కందుకూరును అభివృద్ధి చేయడానికి , శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని బుర్ర మధుసూదన్ యాదవ్ తెలిపారు. రామాయపట్నం పోర్టు వల్ల పదివేల ఉద్యోగాలుఅందుబాటులో నికి వస్తాయన్నారు. గతంలో టిడిపి కందుకూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు విజ్ఞతతో వైకాపాకు ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, న్యాయవాది ముప్పువరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi