Monday, 02 March 2026 12:21:25 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి

Date : 15 April 2024 09:07 AM Views : 1396

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రజాస్వామ్యంలో చీకటి రోజు కందుకూరు అమరావతి: సీఎం వైఎస్, జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాళ్ల దాడి ప్రజాస్వామ్యంలో చీకటిరోజు లాంటిదని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సీఎంపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు చేయటం వలన అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందన్నారు. అధికారులు వెంటనే దోషులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిపై ఇలాంటి దాడులు జరగటం హేయమైన చర్యన్నారు. ఇటువంటి దాడులు చేయడం వలన అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోవు ఎన్నికలు కక్షలు, కార్పన్యాలు, డబ్బులతో ముడిపడి ఉన్నాయని దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కొంతమంది వ్యక్తులు ఈ దాడిని ముఖ్యమంత్రే స్వయంగా చేయించుకున్నాడని ప్రకటించడం అది వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ఈ విధంగా దాడులు ఎవరు మెప్పు పొందేందుకు చేస్తున్నారు వారు రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే రానున్న రోజుల్లో సాధారణ ప్రజానీకానికి ఎంత మాత్రం రక్షణ ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ విధమైన దాడులు చేయడం వారి యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. అధికారులు స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :