Friday, 17 April 2026 03:23:40 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సేవకు వందనం

Date : 02 December 2023 09:37 PM Views : 186

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సేవకు వందనం వార్డు ప్రజల అభిమానం పొందుతున్న పెనుమల్లి కావలి, అమరావతి జ్యోతి ; కడుపు నిండిన వారికి పంచ పరమాన్నాలు పెట్టేదానికన్నా ఆకలిగా ఉన్నవారికి సమయానికి కడుపునిండా పట్టెడు అన్నం పెడితే అదే నిజమైన సేవకు దర్పణం పడుతుంది.. "ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న" అన్న స్ఫూర్తికి 29వ వార్డు వైసీపీ ఇన్చార్జి "పెనుమల్లి అశోక్" భాష్యం చెప్పారు. విధి వంచితుడైన ఓ బాలుడు పుట్టుకతోనే శారీరిక, మానసిక వికలాంగుడిగా జీవిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి మస్తాన్ సుజాత నిరుపేద దంపతులు 29వ వార్డులో జీవనం సాగిస్తున్నారు. వారికి హర్షవర్ధన్ కుమారుడు ఉన్నారు. పుట్టుకతోనే శారీరిక మానసిక వికలాంగుడు. ఆబాలుడికి గతంలో వికలాంగ పెన్షన్ వస్తు కొన్ని ఆణివార్య కారణాలవల్ల పెన్షన్ ఆగిపోయింది. దాంతో ఆ బాలుడు వైద్య ఖర్చులకు డబ్బులు లేక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు. కూలి నాలి చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మందులు కొనిచ్చేవారు. ఒక ప్రక్క పేదరికం మరో పక్క బిడ్డకి మందులు కొనిచ్చే స్తోమతలేక ఆతల్లిదండ్రులు కన్నీటి పర్వతంఅవుతున్నారు.ఈవిషయం వార్డు వైసిపి ఇంచార్జ్ దృష్టికి తెచ్చారు. ఆ పేద దంపతుల పరిస్థితిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి ఆ బాలుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేపించారు. శనివారం పెన్షన్ డబ్బులు బాలుడు చేతికి ఇవ్వటంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ డబ్బులతో బాబుకు మందులు కొనటానికి వస్తాయని కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరుపేదలకు సేవ చేసినప్పుడేకదా నిజమైన సేవకు నిర్వచనం. ఆ మంచి మనసు ఉన్న పెనుమల్లు అశోక్ ను వార్డ్ ప్రజలు అభినందనలతో ముంచెత్తారు. ఎదుటి వారు ఎంతటి వారు అయిన చిరు నవ్వు తో పలకరించే వ్యక్తి అందరివాడు అని కొనియాడారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :