Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సమస్యలు తెలుసుకుంటూ.. భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ ఇంటూరి నాగేశ్వరరావుకు పెరుగుతున్న ప్రజాదరణ 31వ వార్డులో బాబుషూరిటీ కరపత్రాల పంపిణీ కందుకూరు, అమరావతి జ్యోతి: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణంలో నిరంతరంగా కొనసాగిస్తున్న *బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ* కార్యక్రమానికి విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. ఏ ఇంటికి వెళ్లినా, ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తూ మద్దతు తెలియజేస్తున్నారు. ఆదివారం ఉదయాన్నే 31వ వార్డు కోవూరు రోడ్ లోని సాయి నగర్ లో ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు పంచారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రావు. ఆదాయం సృష్టించడం చేతగాక, అప్పులు తెచ్చి బండి లాగిస్తున్నారు. ఆ భారం అంతా మన పైన, మన బిడ్డల పైన పడుతుందన్న విషయాన్ని గమనించండి. ఈ దుర్మార్గుడిని సాగనంపితే గాని మన రాష్ట్రం బాగుపడదు. - నాగేశ్వరరావు కందుకూరులో, ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఏమైనా అభివృద్ధి కనిపించిందా ? ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఆ నిధులు తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు 75 కోట్లకు జగన్ హామీలు ఇచ్చి, కందుకూరు జనాన్ని మోసం చేశారు. అలాంటప్పుడు వైసిపికి మరోసారి ఎందుకు ఓటు వేయాలో ప్రజలే ఆలోచించాలి - నాగేశ్వరరావు. రాష్ట్రంలోనైనా, నియోజకవర్గంలోనైనా తిరిగి అభివృద్ధి పరుగులు పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. బిడ్డల భవిష్యత్తుల దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆలోచించి ఓటు వేయండి. కందుకూరు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తాను. నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరుతున్నా - ఇంటూరి నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు అత్తంటి శివకృష్ణ, చుంచు వేణు, గుమ్మల్ల మాల్యాద్రి, జమ్మూ వెంకట చైతన్య, నాటకం శంకర్, సవిడిపోయిన వెంకటకృష్ణ, పీలా శ్రీనివాసులు, సవిడిబోయిన సాయి, రావెళ్ల వెంకటేశ్వర్లు, పంది యానాది నాయకులు చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు వేణు, చుండూరి శ్రీనివాసులు, షేక్ సలాం, షేక్ రూబీ, పులి నాగరాజు, ముప్పవరపు వేణు, షేక్ మమ్ముషా, మచ్చ మనోహర్, గుమ్మ శివ, ఓరుగంటి రామ్మూర్తి, గొల్లప్రోలు కొండలు, శేఖర్ లింగాబత్తిన మాల్యాద్రి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi