Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : రా.. కదలిరా కార్యక్రమానికి తరలిన టీడీపీ కార్యకర్తలు. గుడ్లూరు, అమరావతి జ్యోతి: ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభకు మండలంలోని టిడిపి కార్యకర్తలు తరలి వెళ్లారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ఇంటూరు నాగేశ్వరరావు పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడితోపాటు పలువురు కార్యకర్తలు కూడా వెళ్లినట్లు సమాచారం. మండలంలోని వలేటివారిపాలెం, పోకూరు, బడేవారిపాలెం, చుండి, శాఖవరం కూనిపాలెం, పోలినేనిపాలెం, కలవళ్ల , నలదలపూరు, నుకవరం, నేకునాం పురం, తదితర గ్రామాల నుంచి కార్యకర్తలు వెళ్లారు. పువ్వాడి వేణుగోపాల్,కోకా చిరంజీవి, లగడపాటి హజరత్, గొంది అయ్యప్ప, అమరా మాల్యాద్రి, ప్రసాద్, ఎం మాలకొండయ్య, కండ్రా మాల్యాద్రి, జంపాల ప్రసాద్, టైలర్ రామ్మూర్తి, దామా జయరాం, తదితరులు వెళ్లారు
Admin
Amaravathi Jyothi