Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు కావలి: కావలిలోని డి బి ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ అండర్ 12 ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. చిన్నపిల్లలకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తే భవిష్యత్తులో క్రీడాకారులుగా రాణించేటువంటి అవకాశం ఉందని ఆయన ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. 14 జిల్లాల నుంచి బాల బాలికలు పోటీల్లో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర రకమి సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డి బి ఎస్ ఇంజనీరింగ్ కళాశాల బాధ్యులు దామోదర్, ఆయా జిల్లాల రగ్బీ ప్రతినిధులు చంద్రశేఖర రావు ,యాసిన్, శంకర్ వంశీ మురళి తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi