Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు పట్టణంలోని శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయం నందు వేంచేసిఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ గురు స్వామి దుడ్డు హనుమద్ ప్రసాద్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారణ స్వాములు 108 హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ అర్చకులు ప్రసన్నాంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి 108 హనుమాన్ చాలీసా పారాయణం మొదలుపెట్టారు.అంతకుముందు సద్గురు శ్రీ రామచరణ్ గురుదేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi