Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: గుడ్లూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము పునర్నిర్మాణమునకు సోమవారం మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల నలబై ఎనిమిది రూపాయలు విరాళం అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు చల్లా మస్తాన్ ఆయన సతీమణి నాగమణి ఒక లక్ష 116 రూపాయలు విరాళం అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు కుంచాల పుల్లయ్య ఆయన సతీమణి విజయలక్ష్మి ఒక లక్షా 116 రూపాయలు విరాళం అందజేసారు.హైదరాబాద్ వాస్తవ్యులు,(స్వగ్రామం సింగరాయకొండ) తన్నీరు రాజు వారి ధర్మపత్ని వెంకటరమణి లు ఒక లక్ష 116 రూపాయలు విరాళం అందజేసారు హైదరాబాదుకు చెందిన ఆర్ విష్ణువర్ధన్ రెడ్డి 25 వేల రూపాయలు విరాళం అందజేసారు .శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుటుంభాలకు ఉండాలని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కోరుకున్నారు.
Admin
Amaravathi Jyothi