Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : కడియం అభివృద్ధికి తన వంతు కృషి. -- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కడియం, అమరావతి జ్యోతి : తమ కుటుంబ రాజకీయ నేపథ్యానికి పునాది నాటి కడియం నియోజకవర్గమని, నియోజవర్గాలు వేరైనా వాటిలో భాగమైన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కాపు సంఘం విరాళాలతో వేమగిరిలో నిర్మించిన హిందూ స్వర్గధామం నూతన భవనాన్ని శనివారం ఎమ్మెల్యే రాజా ప్రారంభించారు. కడియం అభివృద్ధికి తన వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ ముందుంటానని రాజా హామీ ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ప్రజా విరాళాలతో అతిపెద్ద స్వర్గధామం భవనాన్ని నిర్మించిన కాపు సంఘం పెద్దలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రంకిరెడ్డి సుబ్బరాజు, కోలా వెంకటరాజు, డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, పులుపు ఆదినారాయణ, వెలుగుబంటి అచ్యుతరాం, సూరపరెడ్డి జానకిరామ్, అక్కిన ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi