Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిడిపి కంచుకోట... విక్కిరాలపేట ఇంటూరి సమక్షంలో పెద్దఎత్తున చేరికలు కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ, క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో.... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. పంచాయతీ వైస్ సర్పంచ్ ఎండ్లూరి మధు, ఎండ్లూరి సురేంద్ర, ఎండ్లూరి బాలకృష్ణ, ఇంకా భారీగా సంఖ్యలో టిడిపిలో చేరారు. ఎస్టీ కాలనీకి చెందిన 15 కుటుంబాలు వారు కూడా పసుపు కండువాలు కప్పుకున్నారు. గ్రామ పార్టీ నాయకుడు గంగవరపు రవి ఆధ్వర్యంలో వీరంతా నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.... గ్రామపార్టీ అధ్యక్షుడు మన్నం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ గంగవరపు బ్రహ్మయ్య, మన్నం శ్రీను, కొత్తపల్లి సుధాకర్, గంగవరపు నారాయణ, కొత్తపల్లి బ్రహ్మయ్య, యక్కటిల్లి కోటేశ్వరరావు, సురేష్, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మన్నం శైలజ, నియోజవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెళ్ల వెంకటసుబ్బారావు, అల్లం వెంకటేశ్వర్లు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు రావుల రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi