Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణానికి చెందిన అప్పనబోయిన నరసింహం 100000/- రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా తీసుకున్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న అప్పనబోయిన నరసింహంని అభినందించారు.. వైసిపి అరాచక విధ్వంస పాలనకు చరమగీతం పాడింది పార్టీ కార్యకర్తలని తెలిపారు.. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని పేర్కొన్నారు.. పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు యువ నాయకులు నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం వంద రూపాయలతో పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని మట్టి ఖర్చులు కింద 10 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పీలా శ్రీనివాసులు, మద్దసాని కృష్ణ, మేకల మాల్యాద్రి, చిత్తారి మల్లికార్జున, ఆవుల నరసింహారావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi