Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : వేమగిరిలో ఘనంగా అయ్యప్ప స్వాముల పేటతుళై కడియం, అమరావతి జ్యోతి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేపగిరిలో అయ్యప్ప స్వాముల పేటతుళై వైభవంగా నిర్వహించారు. ఆ గ్రామ శ్రీ ధర్మశాస్త్ర పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు రంగులు వేసుకొని, బుడగలు కట్టుకొని కేరళ వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అడుగడుగునా అయ్యప్ప స్వాములు కేరళ వాయిద్యాలకు లయ బద్దంగా నృత్యాలు చేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. వట్టికూటి అచ్చారావు స్వామి, కొత్తూరు పణి స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
Admin
Amaravathi Jyothi