Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిది కందుకూరు,అమరావతి జ్యోతి: కందుకూరు మున్సిపాలిటీని సుందరంగా, ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అడుగులు వేస్తున్నారు.అన్ని వార్డుల్లో పూర్తిగా సిసి రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి, తద్వారా స్వచ్ఛ కందుకూరుగా మార్చాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు వద్ద శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కోవూరురోడ్డులోని అగపే చర్చి వరకు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.మొత్తం అంచనావిలువ 26.10 లక్షలు కాగా, ఆ నిధులతో రోడ్డుకు రెండు వైపులా 630 మీటర్లు దూరం సైడ్ కాలువలు, మధ్యలో ఎనిమిది చోట్ల పైపు కల్వర్టులు నిర్మించనున్నారు.పట్టణంలో ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం అనేది కనిపించకూడదని అధికారులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు. అవసరమైనచోట్ల సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.పక్కనే ఏకలవ్యనగర్ లో, ఎస్టీ కాలనీవాసుల కోరిక మేరకు కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డును, కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉన్నం వీరాస్వామి, చిలకపాటి మధు, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, వడ్డేళ్ళ రవిచంద్ర, చుండూరి శ్రీను, మధు, యర్రా ముసలయ్య, షేక్ నాగూర్, వేముల ప్రసాద్, సవిడిపోయిన వెంకటకృష్ణ, ముచ్చు వేణు, పులి నాగరాజు, కంసాని మయూరి, భవనాసి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi