Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 35వ వార్డు వైసీపీ నుండి టీడీపీ లోకి చేరికలు కావలి,అమరావతి జ్యోతి :పట్టణం 35వ వార్డు వైసీపీ ముస్లిం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఆదివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైకుంఠపురం నుండి షేక్ సుల్తాన్ భాష ఆధ్వర్యంలో షేక్ బాదుల్లా (టైలర్), షేక్ బాదుల్ షేక్ జమాల్సా, షేక్ అల్లు, షేక్ జిలాని, తదితర 15 మంది వైసీపీ ని వీడి టీడీపీ లో చేరారు.. వీరికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ ముస్లిం లపై క్రిష్ణారెడ్డి గారు చూపుతున్న ప్రేమ ఎనలేనిదని తెలిపారు.. ముస్లింలు మొత్తం ఆయనకు అండగా ఉన్నారని, ఆయనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు..
Admin
Amaravathi Jyothi