Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నెల్లూరు: నెల్లూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) జాతీయ అవార్డును సాధించింది. జల్ సంచయ్- జన్ భాగీదారీ అరుదైన అవార్డు మన రాష్ట్రానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు దక్కింది. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యమిచ్చినందుకు దక్షిణ జోన్లో కేటగిరీ-3 కింద జిల్లాకు ఈ అవార్డు వచ్చింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ గంగాభవానీ చేపట్టిన వివిధ రకాల నీటి సంరక్షణ పనులతో ఈ అవార్డు సాధించారు.
Admin
Amaravathi Jyothi