Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : పిఎన్వరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన --ఉగ్ర వెలిగండ్ల, అమరావతి జ్యోతి ఫిబ్రవరి 22 :మండలంలోని పందువ నాగులవరం బస్టాండ్ సెంటర్ నందు మండుతున్న ఎండల దృష్ట్యా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి సూచనలు మేరకు టిడిపి యువ నాయకుడు వెన్నా వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను గురువారం ఉగ్ర నరసింహారెడ్డి చేతులు మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ, వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం ఒక మంచి శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెన్నా వెంకటేశ్వర రెడ్డి నాయకత్వ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్యామల కాశిరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జి దొడ్డ వెంకటసుబ్బారెడ్డి, రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, వెలిగండ్ల ఎంపీటీసీ సభ్యులు చిలకల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన ప్రతాప్ కుమార్, మండల తెలుగు యువత కర్నాటి భాస్కర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి యద్దనపూడి సాల్మన్ రాజు, మండల టిడిపి నాయకులు కీసరి రమణారెడ్డి, మండల బీసీ నాయకులు పిన్నిక బాలకోటయ్య, ముక్కు శ్రీనివాసరెడ్డి, మన్నేపల్లి రవి, శెట్టి రామచంద్రయ్య, మరపగుంట్ల మాజీ సర్పంచ్ ఒంగోలు శ్రీనివాసులు, నిర్వాహకులు కీసరి రవికుమార్ రెడ్డి, ఎక్కంటి శశి కుమార్ రెడ్డి, ఐటీడీపీ నాగరాజు, కటుకూరి ఖాజా, సైరుద్దీన్,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi