Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు ప్రాంతానికి చెందిన ప్రముఖులు, సేవా తత్పరులు వాసవి సేవాదళ్ ఆర్యవైశ్య మీడియా ప్రతినిధి చెక్కా కేశవరావు,నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు కోటేశ్వరరావలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ తమిళనాడు వారు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి ఘనంగా సన్మానించింది.ఆదివారం హోసూర్ ప్రాంతంలో హోటల్స్ హిల్స్ నందు జరిగిన కార్యక్రమంలో వారు చేసిన సేవా కార్యక్రమాన్ని గుర్తించి డాక్టరేట్లు ఇచ్చి గౌరవించడం జరిగినది.గౌరవ డాక్టర్లు పొందిన వారు ఇరువురు స్పందిస్తూ సేవా కార్యక్రమంలో మరింత బలంగా పాల్గొనుటకు ఈ డాక్టరేట్లు మేము ఉపయోగించుకోగలమని మా మీద మరింత బాధ్యతను పెంచే విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. గౌరవ డాక్టర్ పొందిన వారికి మిత్రులు శ్రేయోభిలాషులు ప్రముఖులు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi