Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : బాల బాలికలందరూ పాఠశాలల్లోనే ఉండాలి రోటరీ క్లబ్ కావలి ప్రెసిడెంట్ స్వర్ణలత పదివేల రూపాయల విలువైన ఫర్నిచర్ అందజేసిన శివకుమారి గుడ్లూరు: చదువే ప్రగతికి మూలాధారం, గ్రామాల్లోని ప్రతి బాలుడు బాలిక, బడిలోనే ఉండాలని, రోటరీ క్లబ్ ఆఫ్ కావలి ప్రెసిడెంట్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం నాడు గుడ్లూరు మండలంలోని తెట్టు పాఠశాలకు10,000 రూపాయలు విలువ చేసె పాఠశాలకు కావాల్సిన ఫర్నిచర్ (2ఆఫీస్ టేబుల్స్ మరియు 8 కుర్చీలు ) రోటరీ క్లబ్ ఆఫ్ కావలి తరపున.. దాత ఈ . శివకుమారి పాఠశాలకు బహుకరించారు.. ఈ సందర్బంగా దాత. శివ కుమారి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి చక్కగా చదువుకుని తల్లీ దండ్రులకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు.. ఈ సందర్బంగా దాత శివకుమారిని పాఠశాల తరపున సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ స్వర్ణ లత, ఇతర రోటరీ సభ్యులు,దాత శివకుమారి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రవీంద్రనాథ్, ఇతర ఉపాధ్యాయులు,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi