Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: మండలంలో మంగళవారం మనసులను కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. బుడిబుడి నడకలతో బోసి నవ్వులతో అల్లారుముద్దుగా పెరుగుతున్న రెండేళ్ళ చిన్నారి మంగళవారం ఉదయం అనూహ్యంగా ఓ ప్రవేట్ స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హృదయాలను కలచివేసే ఈ విషాద ఘటన కందుకూరు మండలంలోని కొల్లగుంట గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం స్కూల్ బస్సు ఎక్కేందుకు వెళుతున్న అన్న వెంట బుడిబుడి పరుగులతో వెళ్ళిన ఆ చిన్నారి బస్సు వెనకాల నిలిచాడు. అది గమనించని స్కూల్ బస్ డ్రైవర్ బస్సును కొద్దిగా రివర్స్ చేయడంతో బస్సు కింద పడిన చిన్నారి నలిగిపోయాడు. ముద్దులొలికే ఆ బంగారు తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.అయినా కూడా జీవంలేని ఆశలతో చిన్నారిని కందుకూరు ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆ చిన్నారి ఈలోకం విడిచాడని డాక్టర్లు విచారంగా తెలిపారు.
Admin
Amaravathi Jyothi