Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మిచౌంగ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి తహశీల్దార్ సుందరమ్మ వలేటివారిపాలెం అమరావతి జ్యోతి నవంబర్ 4వలేటివారిపాలెంమండలంలో మిచౌంగ్ తుఫాను ఉద్రిక్తంగా ఉందని వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తహశీల్దారి కె వి బి టి సుందరమ్మ తెలిపారు. తహశీల్దారి కెవి బిటి సుందరమ్మ మాట్లాడుతూ ప్రజలు అప్రమిత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని లేని యెడల పనులను వాయిదా వేసుకోవాలని అన్నారు. తుఫాన్ సమయంలో కరెంట్ తీగలు తెగిపోవడం, చెట్లు విరిగి రోడ్లపై పడటం, తదితర సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు తహశీల్దార్ కార్యాలయానికి గాని గ్రామ రెవిన్యూ సిబ్బందికి గాని, వీఆర్వోలకి తెలియజేయాలని సూచించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్లియర్ చేస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు . రాళ్లపాడు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని , ప్రాజెక్టుకు పూర్తి సామర్థ్యానికి వరద నీరు చేరితే కిందికి గేట్లు ద్వారా వదిలే అవకాశం ఉందని దీంతో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దారు సూచించారు.
Admin
Amaravathi Jyothi