Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సమ సమాజ స్థాపనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లక్ష్యం: ఎం ఎల్ ఏ మహిధర్ రెడ్డి కందుకూరు, అమరావతి జ్యోతి : సమసమాజ స్థాపన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లక్ష్యమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67.వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని యావత్తు ధారపోసినటువంటి మహా మేధావి అని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి, అతి ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి, అందరి హక్కుల కోసం ఆయన సూర్యుని వలె ప్రభాతిన్చాన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘనమైన నివాళులర్పించడం అంటే ,ఆయన అడుగుజాడల్లో యావద్దేశం నడవడమేనని ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi