Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : నిండు మనసుతో స్వామిని ఆదరించండి : దామచర్ల సత్య పొన్నలూరు, అమరావతి జ్యోతి : రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో ఎమ్మెల్యే స్వామిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దామచర్ల సత్య పిలుపునిచ్చారు. మండలంలోని ముత్తరసుపాలెం గ్రామంలో బుధవారం మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కీలకంగా పనిచేయాలని 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా స్వామి ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దాయన దివంగత ఆంజనేయులు హయాంలో మారుమూల గ్రామాలకు సైతం మౌలిక వసతుల కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. తదనంతరం 2014 ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారన్నారు. మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరినీ కలిసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్, సీనియర్ నాయకులు కర్ణా కోటిరెడ్డి, పిల్లి వెంకటనారాయణ రెడ్డి తోపాటు పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi