Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కందుకూరు: కందుకూరు గ్రామ దేవత ఆదిపరాశక్తి శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ విప్, కుప్పం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వారి సతీమణి శ్రీమతి సరిత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరిట ఆలయ అర్చకులిచే ప్రత్యేక పూజ చేయించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేష వస్త్రం, వేద ఆశీర్వచనం ఎమ్మెల్సీ శ్రీకాంత్ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కనుమ పండుగ రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అమ్మ వారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి, కందుకూరు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కార్తీక్, విద్య మౌలిక వసతుల కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, గుర్రం మధు,చక్కా వెంకట కేశవరావు, ఇస్కాల మధు, రవ్వా శ్రీనివాసులు, పాదర్తి మణి, అనుమాల శెట్టి శ్రీకాంత్, న్యాయవాది బుచ్చయ్య గుప్తా, మౌనిక స్టూడియో అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi