Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైసీపీ నుండి టీడీపీ లోకి చేరికలు కందుకూరు, అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామం ఎస్సి కాలనీ చెందిన వైసీపీ నాయుకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరావు గారి సమక్షంలో టీడీపీ లో చేశారు. ఈ సందర్బంగా ఇంటూరి నాగేశ్వరావు పార్టీ కార్యాలయం లో వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా వుంటానని కష్టానష్టాల్లో మీకు తోడుగా వుంటానని, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చిన నా ఇంటి తలుపు తడితే వెంటనే స్పందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు నార్నే రోశయ్య, బొద్దులూరి కొండలరావు, తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi