Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పసుపులేటి గూటికి వైసిపి కీలక నేత... *పసుపులేటి కి మద్దతు పలికిన కావలి రూరల్ మండలం చెన్నై పాలెం కి చెందిన ప్రళయ కావేరి రమణయ్య...* *కండువా కప్పి ఆహ్వానించిన పసుపులేటి సుధాకర్....* కావలి,అమరావతి జ్యోతి: కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కి రోజురోజుకు భారీగా మద్దతు పెరుగుతోంది. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పసుపులేటి సుధాకర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఇవాళ కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం కు చెందిన వైసిపి కీలక నేత ప్రళయ కావేరి రమణయ్య పసుపులేటి గూటికి చేరారు. పీఎస్ఆర్ కార్యాలయంలో పసుపులేటి సుధాకర్ ను కలిసిన ఆయన స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి తాను ఆకర్షితుడిని అయ్యానని, సుధాకర్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తనతో పాటు అనేకమంది వైసీపీ నుంచి త్వరలో పసుపులేటి సుధాకర్ చెంతకి చేరబోతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రళయకావేరి రమణయ్యకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు పసుపులేటి సుధాకర్. తనకోసం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు పలకడం చాలా సంతోషంగా ఉందన్నారు సుధాకర్. కావలి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని వెల్లడించారు.
Admin
Amaravathi Jyothi