Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: అధిక పారితోషికం కల్పించి తమను ఆదుకోవాలని రావూరు గ్రామానికి చెందిన రామాయపట్నం పోర్టులో భూములు కోల్పోయిన గొల్లప్రోలు హరికృష్ణ, పోలుగంగు కృష్ణ, వెంకట్రావు తో పాటు పలువురు రైతులు సోమవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, తహసిల్దార్ స్వర్ణ, సబ్ కలెక్టర్ శ్రీ పూజ కు సోమవారం వినతిపత్రాలు అందజేశారు మండలంలోని రావూరు గ్రామ పరిదిలోని సదరు గెజిట్లో తెలిపిన ప్రకారం 2013 భూసేకరణ చట్టం అనుసరించి, పారిశ్రామిక కూడలి స్ధాపించుట, అవసరమైన భూములు సేకరించుటకు, ప్రకటన ఇచ్చియున్నారు. ఈ భూములు మేము పారిశ్రామిక కూడలికి ఇచ్చిన యెడల, భూ హక్కు దారులమైన మేము (రైతులు) భూములు కోల్పోయి జీవనాధారం కోల్పోతాము. ఈ భూమినే నమ్ముకొని, కూలి పనులు చేసుకొని బ్రతుకుతున్న వ్యవసాయ కార్మికులు పనులు లేక జీవించడానికి అవకాశం లేకుండా పోతుంది. మీరు ఎన్నిసార్లు గ్రామ సభలు పెట్టినా కూడా రైతులు, ప్రజలు, మేము మా భూములను ఇవ్వలేము అని చెప్పినాము. 2013 చట్టం కూడా ప్రజల ఆమోదంతో తీసుకోండి అని చెబుతుంది. కానీ అధికారులు మాత్రం ప్రజల ఆమోదంతో తీసుకోవడానికి గాని, 2013 చట్టం ప్రకారం పోవడానికిగాని, సిద్ధపడడం లేదు. బలవంతముగా మా భూములను తీసుకొనుటకు సిద్ధపడుతున్నట్లుగా మాకు అర్ధమౌతున్నది. కాని మేము కూడా ప్రజా ప్రయోజనముల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి కొరకు తప్పనిసరి పరిస్థితులలో భూములు ఇవ్వవలసి వస్తున్నది. కాబట్టి ఒక ఎకరం భూమికి కనీస మద్దతుధర రూ.35,00,000లు (అక్షరములా ముఫ్పై ఐదు లక్షల రూపాయలు) మాకు పారితోషికంగా ఇప్పించవలసినదిగా మరియు మా గ్రామ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకొనవలసినదిగా వారు కోరారు.
Admin
Amaravathi Jyothi