Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మహిళాలోకానికి అండగా తెలుగుదేశం పార్టీ కందుకూరు, అమరావతి జ్యోతి: - నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *ఇంటూరి నాగేశ్వరరావు* గారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు... ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. - టిడిపి కార్యాలయంలో జరిగిన వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు... కేక్ కట్ చేసి మహిళలకు తినిపించిన నాగేశ్వరరావు గారి సతీమణి సౌజన్య గారు... - మహిళలకు ఆస్తిలో సమాన వాటా, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్, తరువాత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎంతో కృషి చేశారు - ఇంటూరి నాగేశ్వరరావు - మహిళా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. వైసీపీ ప్రభుత్వంలో మహిళలను అవమానించారు, వారిపై లెక్కలేనన్ని అఘాయిత్యాలు, దారుణాలు జరిగాయి. పెరిగిన ధరలు, పన్నులు, చార్జీలతో కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలా అని మహిళలు ఆందోళన చెందుతున్నారు - ఇంటూరి నాగేశ్వరరావు - రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాల్లో జమ చేస్తారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంకా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం.. ఎంతమంది పిల్లలు చదువుతుంటే ఎంతమందికి అమ్మ ఒడి అమలు చేస్తారు - ఇంటూరి నాగేశ్వరరావు - కార్యక్రమంలో కందుకూరు పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi