Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : అయ్యప్పస్వాములకు కోటపాటి అన్న ప్రసాద వితరణ పామూరు, అమరావతి జ్యోతి: పామూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రముఖ పారిశ్రామికవేత్త కోటపాటి జనార్ధన్ రావు మాలలు ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ ఏర్పాటు చేశారు. 2018 వ సంవత్సరంలో శాశ్వత అన్నదానానికి 2 లక్షల 51000 రూపాయలు విరాళంగా ఇచ్చారని, అప్పటినుండి ప్రతి సంవత్సరము డిసెంబర్ 15వ తేదీన కోటపాటి జనార్దన్ రావు పేరు మీద అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేస్తున్నామని, రెండు నెలలు నిత్య అన్నదానానికి ఉచితంగా నీళ్లను కూడా సరఫరా చేస్తున్నారని దేవస్థానం అధ్యక్షులు గుత్తి వెంకటరాజా, కావిటి సుబ్బయ్య లు తెలిపారు. అన్నపూర్ణాదేవికి పూజానంతరం కోటపాటి జనార్దన్ రావు, తల్లి బోట్ల గూడూరు మాజీ సర్పంచ్ కోటపాటి విశాలమ్మకు దేవస్థానం అధ్యక్షులు దుశాలవలతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో వాయినేని వైట్ మాల్యాద్రి, గుర్రాల నాగేశ్వరరావు, మార్నేని రామకృష్ణ, కోటపాటి రాజా, కోటపాటి రాము, రోశయ్య పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi