Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు పట్టణంలో కోవూరు రోడ్డు నందు ఉన్న దుర్గమ్మ వారి ఆలయంలో ఐదవరోజు అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అవతారంలో కరెన్సీ నోట్లతో భక్తులకు దర్శనమిచ్చారు. "సుమారు 30,01116 రూపాయల (30 లక్షల వెయ్యి నూట పదహార్లు) విలువ గల వివిధ రకాల కొత్త నోట్లతో అమ్మవారిని విశేషంగా ఆలయ అర్చకులు మాధవరావు స్వామి అలంకరించారు. ఈ అలంకారం భక్తులకు కనువిందు చేసింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi