Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అనివేటి మండపం నిర్మాణానికి రూ 26,116 విరాళం కందుకూరు అమరావతి జ్యోతి కందుకూరు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున నిర్మాణంలో భాగంగా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు భక్తులు, దాతలు విరాళాలు అందించటం అభినందనీయమని కొండూరి వసంతరావు తెలిపారు. ఇప్పటికే సుమారు 6 కోట్లతో దేవాలయమును నిర్మించినట్లు తెలిపారు. అదే విధంగా దేవాలయం ముందు నూతనంగా అనివేటి మండపాన్ని దాదాపుగా రూ 4 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించినట్లు తెలిపారు. భక్తులు అంకమ్మ తల్లి పై నమ్మకంతో విరివిరిగా విరాళాలు అందిస్తున్నారని వివరించారు. ఆదివారం కందుకూరు వాస్తవ్యులు గుర్రం శేషగిరిరావు ధర్మపత్ని శ్రీలక్ష్మమ్మల కుమారులు మహేష్ కుమార్ వారి ధర్మపత్ని హిమబిందు సుమన్ కుమార్ వారి ధర్మపత్ని నాగలక్ష్మి చైతన్య లు అనివేటి మండపం నిర్మాణమునకు 26,116 రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi