Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరావు. కందుకూరు, అమరావతి జ్యోతి: జనార్ధన స్వామి కళ్యాణ మండపంలో యుటిఎఫ్, ఐద్వా, సిఐటియు డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు.. ముఖ్యఅతిథిగా హాజరైన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి . ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి ఒక్క మహిళలకే ఉందని, ప్రస్తుతం అన్ని రంగాల్లో వాళ్ళు సాధిస్తున్న విజయాలకు ప్రతి ఒక్కరు హాట్సాఫ్ చెప్పాలన్నారు. ఒక వైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు వివిధ వృత్తులలో అద్భుతాలు సాధించడం మహిళలకే చెల్లిందని ప్రశంసించారు. సమాజ గమనాన్ని మార్చే శక్తి కూడా మహిళలకే ఉందని, ప్రస్తుతం కళ్ళెదుట జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని, మార్పుకు నాంది పలకాలని నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్, ఐద్వా, సిఐటియు కమిటీలలోని మహిళా నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు.
Admin
Amaravathi Jyothi