Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఏసుప్రభువు దయ అందరిపై ఉండాలి --కోటపాటి జనార్దన్ రావు కందుకూరు, అమరావతి జ్యోతి: కరుణామయుడు ఏసుప్రభువు దయ ప్రజలందరిపై ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోషకరమైన ఈ పర్వదినం నాడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రీస్తు జన్మించి దాదాపు 2 వేల సంవత్సరాలు పైబడిన ఆయన చూపిన కృప, దయ ఇప్పటికీ నిలిచి ఉన్నాయన్నారు. ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఏసు ప్రభువు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. తన బోధనల ద్వారా ప్రపంచానికే మార్గనిర్దేశం చేశారన్నారు. అభాగ్యులపై క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, శాంతి ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా క్రిస్టియన్ సోదరసోదరీమణులకు కోటపాటి జనార్దన్ రావు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi