Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : :బుర్రా మధుసూదన్ కు ఘన స్వాగతం పలికిన వైసిపి శ్రేణులు గుడ్లూరు, అమరావతి జ్యోతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కనిగిరి ఎమ్మెల్యే మరియు కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటిల్లో గెలిచిన వెంటనే 98 శాతం హామీలు నెరవేర్చారని ఆయన అన్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట సారిగా గుడ్లూరు వచ్చిన ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. మండలం కేంద్రమైన గుడ్లూరు సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బుర్రా మధుసూదన్ యాదవ్ . అనంతరం అంకమ్మ తల్లి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక జీకే ఎల్కే కళ్యాణ మండపంలో కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో జడ్పిటిసి బాపిరెడ్డి, జెసిఎస్ కోఆర్డినేటర్ గాజుల కిషోర్, వైసీపీ మండల కన్వీనర్ కాపులూరి కృష్ణ, మాజీ జెడ్పిటిసి డి వెంకటరామిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ మండల నాయకులు, గొర్ల రమేష్, ఈర్ల వెంకటేశ్వర్లు, షాకీర్, పుల్లారెడ్డి, కాట్రగడ్డ వెంకట్రావు, సిహెచ్ రవీంద్ర, బిల్లా రమణయ్య,రషీద్, నక్కల రామకృష్ణ, చిత్తారి మాధవ, కార్యకర్తలు ,ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, మహిళలు, అభిమానులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Admin
Amaravathi Jyothi