Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఫలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృషి రాళ్లపాడు కుడికాలువకు నీరు విడుదల లింగసముద్రం: గత మూడు రోజులుగా రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటు మరమ్మత్తు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతటి విపత్తు కష్టమైన గేటు మరమ్మత్తు పనులు పూర్తిచేసి రైతులకు నీరు అందించాలనే ఎమ్మెల్యే ధృడ సంకల్పం ఫలించింది. అధికారులు, బయటి నుంచి వచ్చిన నిపుణుల బృందంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎట్టకేలకు శుక్రవారం మద్యాహ్నం నాటికి రాళ్లపాడు కుడి కాలువ గేటు మరమ్మత్తులు పూర్తయ్యాయి. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ప్రాజెక్టు వద్దకు వెళ్ళింది మొదలు ప్రతీ నిమిషం రైతుల నీటీ కోసమే ఎమ్మెల్యే ద్యాస సాగింది. పక్కనున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఇరువురూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. కష్ట సాధ్యమైన పనిని పూర్తి చేసిన నిపుణులకు, అధికారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. రాళ్ళపాడు కుడి కాలువ ప్రాంత రైతులు ఆనందంగా పంటను వేయవచ్చని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. భగవంతుని దయతో ఈ ఏడాది వర్షాలు కురిసి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో సంపూర్ణంగా నిండాయని అన్నారు. మరోసారి అధికారులు, నిపుణుల బృందానికి అభినందనలు తెలిపారు. నాలుగు రోజులపాటు రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువకు నీరు విడుదల చేయడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు
Admin
Amaravathi Jyothi