Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కనిగిరిలో టిడిపి మేనిఫెస్టో ప్రచారంతో హోరెత్తించిన ---ఉగ్ర కనిగిరి టౌన్, అమరావతి జ్యోతి : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కనిగిరిలో బుధవారం బాబు షూరిటీ-- భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మన ఊరు- మన ఉగ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలోని ఎమ్మెస్సార్ రోడ్ ,బొడ్డుచావడి మీదుగా, ఆర్టీసీ డిపో వరకు ప్లకార్డులతో టిడిపి శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి మినీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి పథకం ద్వారా మహిళలకు, మరియు ప్రజలకు అందించే పథకాల గురించి కరపత్రాలను పంచుతూ రాబోయే 2024 శాసనసభ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ,వేయించి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన ప్రజలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మనేని శ్రీనివాస్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు, మరియు పార్టీ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.
Admin
Amaravathi Jyothi