Amaravathi Jyothi - Andhra Pradesh / Krishna : 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం ఆ ఇరువురి ప్రాణాలను బలి తీసుకుంది...... గుడివాడ,అమరావతి జ్యోతి: కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్ లో నివసిస్తున్న కొలుసు రాంబాబు, కనకదుర్గ మధ్య 500 రూపాయల విషయమై చిన్నపాటి గొడవ మొదలైంది.. భార్య 500 అడిగితే ఇవ్వలేదని తాగిన మైకంలో భార్య మీద కోపంతో రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా. అది గమనించిన భార్య కనకదుర్గ వెంటనే ఆ విషయాన్ని కుమారుడు కు వివరించడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన కొడుకు. విషయం తెలుసుకున్న కుమారుడు హుటాహుటిన తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ కారులో హాస్పటల్కు తీసుకువెళ్లగా అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. తండ్రి మరణ వార్తను కుమారుడు తల్లికి ఫోన్ ద్వారా తెలియజేయగా. , భర్త మరణ వార్త విన్న కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని వేలాడటాన్ని చూసిన కొడుకు తన తల్లినైన కాపాడుకోవాలని ఉద్దేశంతో వేలాడుతున్న తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది. తల్లిదండ్రుల మరణ వార్తను సోదరికి మరియు బంధువులకు తెలియజేయగా బంధువుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకేరోజు భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరుగు పొరుగువారు ఈ ఘటనతో శోకసముద్రంలో మునిగారు.
Admin
Amaravathi Jyothi