Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ పేద ప్రజలపై యుద్ధం ప్రకటించినట్లు ఉంది:నేతి మహేశ్వరరావు కందుకూరు, అమరావతి జ్యోతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేతి మహేశ్వర రావు కందుకూరులో తన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్టీ మేదరమెట్లలో జరిపిన సిద్ధం సభకి వచ్చిన పేదలు చనిపోవడం మీద మీడియాతో మాట్లాడటం జరిగింది నిన్నటి సంఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి అలాగే కోర్ట్ లు కూడా ఈ సంఘటనని సుమోటో గా తీసుకొని విచారణకి ఆదేశించవలసిందిగా కోరుచున్నాము అన్నారు. నిన్న తొక్కిసలాట జరగటానికి కారణం మద్యం తాపించడముతో ఇరుకు ప్రాంగణం లో సభ నిర్వహించడమే అన్నారు ఇక్కడ దారుణమైన పరిస్థితి ప్రభుత్వ లో ఉండే అధికారులే దగ్గరుండి మద్యం తాపించటానికి అనుమతి ఇచ్చినట్లు ఉంది అన్నారు? ప్రభుత్వ సభలకు మద్యం తాపించి సమీకరించటం నేనా పేదల కోసం పెత్తందార్ల మీద యుద్ధం చేస్తున్నాను అనే పెద్ద పెద్ద ఊదరగొట్టే ప్రసంగాలు అని అడుగుతున్నాం అన్నారు రాష్ట్రములో జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అంటూ అమాయక ప్రజలను బస్సుల్లో కుక్కి మద్యం తాపించి తొక్కిసలాటలు జరిగేలా ప్రేరేపించి మాటలతో ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేయడం చూస్తుంటే పేదల మీద యుద్ధం ప్రకటించినట్టు ఉంది నిన్నటి సభ నిర్వహించిన తీరు చుస్తే అన్నారు ప్రజాస్వామ్యంలో సిద్ధం అంటూ వేలు చూపించే జగన్ రెడ్డి పోస్టర్ లు చుస్తే ప్రజాస్వామ్యం మీద యుద్ధం ప్రకటించినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు తనకి బలం ఉంది అని చూపించుకోవడానికే అమాయక పేద ప్రజలను స్కూల్ పిల్లలు వెళ్లే బస్సులలో తరలించిన పరిస్థితి చుస్తే జగన్ రెడ్డి పేదలను బానిసలుగా చూస్తున్నారు అని అర్ధమవుతుంది.స్కూల్ పిల్లలకోసం అనుమతించిన బస్సుల్లో పెద్దలకు తరలించడానికి ట్రాన్స్ పోర్ట్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు అన్నారు? నేషనల్ హైవే పక్కన తీసుకొన్న ప్రాంగణానికి అనుమతులు తీసుకున్నారా? నేషనల్ హైవే కిలోమీటర్ల పరిధిలో మూడుగంటలు పాటు ట్రాఫిక్ స్తంభించి పోతే సభ నిర్వాహకుల మీద కేసు లు ఉండవా? సంవత్సరంలో 365 రోజులు పాటు అప్పుల కోసం పాకులాడే జగన్ రెడ్డి సుమారు 600 కోట్లతో సిద్ధం అంటూ ప్రచారం కోసం వాడటాన్ని ఏ విధంగా చూడాలి అన్నారు ఒక్కోసభకి సుమారు 90 కోట్లకు పైగా ఖర్చులు పెడుతున్నారంటే ఇంత ఇంత ఖర్చులు ఎలా పెట్టగలుగుతున్నారు ఎన్నికల కమిషన్ ఎలా చూస్తూ ఊరుకుంది అని అన్నారు శబ్దం సభకు పెట్టిన ఖర్చులను పార్టీ ఖర్చులుగా సక్రమం గా చూపించే పరిస్థితి ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేస్తాం అనాలి కానీ నా పార్టీ కోసం యుద్ధం చేయండి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది ప్రజలను మద్యం మత్తులో ఉంచి రేపు జరగబోయే ఎన్నికల్లో గొడవలకు ప్రేరేపించేలా జగన్ రెడ్డి సిద్ధం సభలు నిర్వహిస్తున్న తీరు చుస్తే అర్ధమవుతుంది అన్నారు రాష్ట్రము పేదల జీవితాలతో చలగాటమాడుతూ సరైన ప్రమాణాలు పాటించని సభల నిర్వహణల మీద కోర్ట్ లు స్పందించి సంబంధిత నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకొంటే తప్ప అమాయకుల ప్రాణాలకు రాష్ట్రము లో రక్షణ లేదు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి వారసుడివి అని అధికారం ఇస్తే రాచరిక పోకడలతో ప్రజలను బానిసలుగా చూస్తున్న విధానం పేద ప్రజలకు అర్ధం అయితే వైస్సార్సీపీ పార్టీ 2024 తరువాత కాళీ అవుతుంది అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేతి మహేశ్వరరావు హెచ్చరించారు.
Admin
Amaravathi Jyothi