Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం వలేటివారిపాలెం అమరావతి జ్యోతి : వలేటివారిపాలెం మండలంలో బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ మహిళలకు అవగాహన కల్పించాలని సిసి కుమారి అన్నారు. శనివారం స్థానిక వైయస్సార్ క్రాంతి పదం కార్యాలయంలో జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈవోఏ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో బాల్య వివాహాలు జరుగుతుంటే ఈవోఏలు మండల జెండర్ కమిటీకి తెలియజేయాలన్నారు. గ్రామస్థాయిలో పొదుపు గ్రూపు సభ్యుల సమావేశాల్లో బాల్య వివాహాలు, గృహ హింస తదితర కార్యక్రమాలపై సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండని బాలికలకు వివాహాలు చేస్తుంటే మండల కమిటీ వెంటనే తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Admin
Amaravathi Jyothi