Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయకట్టు రైతుల పంటలకు నీరు అందిస్తాం ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు కాకర్ల సురేష్ లింగసముద్రం: కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద కుడి కాలువ గేటు మరమ్మత్తులను పూర్తి చేసిన నిపుణుల బృందానికి అధికారులను అభినందించిన ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్. ప్రాజెక్టు వద్ద ఇరువురు ఎమ్మెల్యేలు జరుగుతున్న మిగతా మరమ్మత్తు పనులు పరిశీలించారు..ప్రాజెక్టు వద్దకు వచ్చిన రైతులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు ఈ సీజన్లో పంటకు పుష్కలంగా నీరు అందిస్తామని, సోమశిల నుంచి ప్రాజెక్టుకు రావలసిన నీటి వాటాను రాళ్లపాడు ప్రాజెక్టు చేర్చేందుకు ఇద్దరం కలిసి కలిసి కృషి చేస్తామని తెలిపారు.. రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం పనులు దగ్గరుండి పర్యవేక్షించి గేటు మరమ్మతులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్ కి ధన్యవాదములు తెలిపారు..
Admin
Amaravathi Jyothi