Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మహా శివరాత్రి సందర్బంగా కనిగిరి డిపో నుండి ప్రత్యేక బస్సులు కనిగిరి టౌన్, అమరావతి జ్యోతి: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్ధం కోసం ది 08/3/24 నుండి 09/03/24 కనిగిరి నుండి పామూరు,సి.ఎస్ పురం మీదగా భైరవకోన,మిట్టపాలెం, కు 23 ప్రత్యేక బస్సులను, అలాగే కనిగిరి నుండి పునుగోడు కు 2 బస్సులు ఏర్పాటు చేసినట్లు కనిగిరి డిపో మేనేజర్ బి. శ్రీమన్నారాయణ బుధవారం ఒక ప్రక టనలో తెలిపారు.రద్దీకి అనుగణంగా మరిన్ని అదనపు బస్సులను నడుపుతామని వివరించారు.కనిగిరి నుండి పామూరు మీదగా భైరవ కోన కు చార్జి 90 రూపాయలు, కనిగిరి నుండి సి ఎస్ పురం మీదగా భైరవకోన కు చార్జి 80 రూపాయలు , పామూరు నుండి భైరవకొనకు చార్జి 60 రూపాయలు, సి ఎస్ పురం నుండి భైరవకొనకు చార్జి 30 రూపాయలు,కోవిలంపాడు నుండి భైరవకొనకు చార్జి 40 రూపాయలు, కనిగిరి నుండి పునుగోడు కు ఛార్జి 20 రూపాయలు గా ఉంటాయని తెలిపారు.ప్రజలు భక్తులు ఈ సౌకర్యం ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
Amaravathi Jyothi