Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ,సమస్యలు పరిష్కరించమంటే బలవంతంగా తాళాలు పగలగొట్టడం ఏమిటని అంగన్వాడీల ఆందోళన వెలిగండ్ల, అమరావతి జ్యోతి : అంగన్వాడి వెలిగండ్ల ప్రాజెక్టు కార్యాలయం నందు ఐదవరోజు ప్రాజెక్టు వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేస్తూ సమ్మె కొనసాగించడం జరిగినది. ముందుగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి అకాల మరణానికి సంతాపంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సభ్యులు ఓ సూరి బాల గురవమ్మ షాబ్జి చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తపరచడం జరిగినది. ఈ సంతాప సభకు ముఖ్యఅతిథిగా యుటిఎఫ్ సీనియర్ లీడర్ మరియు జిల్లా జన విజ్ఞాన వేదిక కన్వీనర్ మాలకొండ రెడ్డి హాజరై మాట్లాడుతూ, సాబ్జి విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో కార్మికులకు, ఉద్యోగులకు ముందుండి నడిపించిన వ్యక్తి అని వారు అకాల మరణం కార్మిక లోకానికి తీరనిలోటని అన్నారు. న్యాయమైన డిమాండ్ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ పెంచుతామన్న జీతాల కోసం అడుగుతూ ఉంటే బలవంతంగా దౌర్జన్యంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను బెదిరించి సెంటర్లను బలవంతంగా తాళాలు పగలగొట్టడం దుర్మార్గపు చర్య అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వెంటనే ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ర్యాలీగా వెళ్లి అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలగొట్టి రికార్డులను తారు మార్చేస్తున్నారని వీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో హోంగార్డు కరీముల్లా కు వినతిపత్రం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు రాయల మాలకొండయ్య, అంగన్వాడి యూనియన్ నాయకులు సోము వెంకట శ్రీలక్ష్మి, సలోమి,తిరుపతమ్మ నాగేంద్రమ్మ ఆదిలక్ష్మి మరియమ్మ, అరుణ, నారాయణమ్మ, సత్యవతి,మల్లేశ్వరి తదితర అంగన్వాడీలు పాల్గొనడం జరిగింది.
Admin
Amaravathi Jyothi