Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : పొన్నూరు ఎమ్మెల్యేగా దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను గెలిపించాలి - మాజీ ఎమ్మెల్యే దివి శివరాం గుంటూరు, అమరావతి జ్యోతి:, పొన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఆదివారం పొన్నూరు పట్టణంలోని ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కళ్యాణ మండపంలో జరిగింది. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు , పొన్నూరు నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం , జనసేన కార్యకర్తలపై ఉందని , ఈరోజు నుండి ఎన్నికలు జరిగే వరకు మండల పార్టీ అధ్యక్షులు , క్లస్టర్ , యూనిట్ ఇన్ చార్జ్ లు , బూతు లెవల్ ఏజెంట్లు , సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని శివరాం సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి , అరాచకాలను అరికట్టాలంటే ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. పొన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా , పేదప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందాలన్నా ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు శివరాం దిశానిర్దేశం చేశారు.....
Admin
Amaravathi Jyothi