Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : *కడియం విద్యార్థులకు రాష్ట్ర స్థాయి బహుమతులు.* కడియం, అమరావతి జ్యోతి : రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీల్లో విజయవాడ మురళి రిసార్ట్సలో జరిగిన పోటీలలో తూర్పుగోదావరి జిల్లా నుండి జె భాను ప్రకాష్ జానపద నృత్యాలు విభాగంలో తృతీయ స్థానం సాధించగా, బాలికల విభాగంలో ఏకపాత్రాభినయం అంశంలో చక్కటి ప్రదర్శన చేసిన వెలుగుబంటి పవిత్రకు నాలుగో స్థానం లభించింది. ఈ విద్యార్థులను రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ ప్రతాపరెడ్డి సత్కరించారు. చక్కటి తర్ఫీదు నిచ్చిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణను ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ సర్పంచ్ ఎం సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్ ,గిరిజాల బాబు, ఎస్ఎంసి చైర్ మెన్ ఎస్ లక్ష్మి అభినందించారు.
Admin
Amaravathi Jyothi