Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : స్వర్ణ స్వయంకృషికి వాటర్ డిస్పెన్సర్, కుర్చీలు పంపిణీ కందుకూరు అమరావతి జ్యోతి:: భారతదేశ యువ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా కోవూరు రోడ్డులోని స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల నందు 54,700/- విలువ చేసే, 50 నిల్కామల్ హ్యాండిల్ లెస్ కుర్చీలు, బ్లూస్టార్ వాటర్ డిస్పెన్సర్, నిత్యావసర సామాగ్రి అందజేశారు, ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఎందరో యువకులు పలు ప్రాంతాల నుంచి డొనేషన్స్ చేశారు. బెల్లం మనోజ్ ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమంలో చక్రి(పొడపాటి శివ కుమార్) కార్యనిర్వాహులుగా వ్యవహించారు మరియు తొట్టెంపూడి పృథ్వీరాజ్, దొరడ్ల ప్రవీణ్, పరిటాల సాయి తరుణ్, సంగ గోవర్దన్, దుంప విష్ణు, షేక్ ముజీబ్, నంబూరి రాము మరియు పాఠశాల కరెస్పాండంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi