Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అభివృద్ధి టీడీపీ తోనే సాధ్యం : ఎమ్మెల్యే స్వామి టంగుటూరు,అమరావతి జ్యోతి : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని ఎమ్మెల్యే స్వామి తెలిపారు. ఆదివారం టంగుటూరు మండల కేంద్రంలోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీ చెందిన 30 కుటుంబాలపార్టీ చేరికల కార్యక్రమంలో యువనేత దామచర్ల సత్య తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పని చేసిందన్నారు. కొందమంది పేదలకు మాత్రమే సంక్షేమం అందజేసి మధ్య తరగతి కుటుంబలపై పన్నుల పేరుతో అదనపు భారం మోపింది వాస్తవం కాదఅన్నారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, సీనియర్ నాయకుడు బెజవాడ వెంకటేశ్వర్లు తోపాటు పలువురు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi