Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం, అమరావతి జ్యోతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత, స్వర్గీయ డా||వైయస్ రాజశేఖరరెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2వ తేదీన(సోమవారం) ఉదయం 10 గంటలకు వలేటివారిపాలెంలోని వైసిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వైసిపి అధ్యక్షుడు పరిటాల వీరస్వామి తెలిపారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి మండల వరిధిలోని అందరూ నాయకులతోపాటు ఎం పి పి, జడ్పీటీసీ, జె సి ఎస్ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు గృహసారథలు సచివాలయం కన్వీనర్లు తోపాటు పార్టీలోని వివిధ హోదాలలో ఉన్న వైసీపీ శ్రేణులు అంతా హాజరు కావాలని ఆయన కోరారు. తొలుత గ్రామాల్లో నిర్వహించండి: తొలుత ఆయా గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వీరాస్వామి సూచించారు. విగ్రహాలకు పూలమాలలు వేసి *ఘనంగా నివాళులు* అర్పించాలన్నారు. దీంతోపాటు *సేవా కార్యక్రమాలు* నిర్వహించవలసినదిగా ఆయన సూచించారు..
Admin
Amaravathi Jyothi